కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం నాడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో ఆర్థర్ హస్తం గూటికి చేరారు. కండువా కప్పిన షర్మిల పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా.. నందికొట్కూర్ నుంచి పోటీచేయడానికి వైసీపీ తరఫున ఆర్థర్కు టికెట్ దక్కలేదు. ఈయనకు హ్యాండిచ్చి దారా సుధీర్కు టికెట్ ఇచ్చింది వైసీపీ. ఆర్థర్ టికెట్ ఇవ్వొద్దని యువనేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఒకట్రెండు రోజులు తిష్టవేసి మరీ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. గత ఎన్నికల్లో ఆర్థర్ విజయం కోసం కృషి చేసిన బైరెడ్డి.. ఇప్పుడు రివర్స్ అయ్యారు.