ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 06:32 PM

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ మేరకు వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,991 మంది భక్తులు దర్శించుకోగా 21,959 మంది తలనీలాలు ఇచ్చారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.57 కోట్లు వచ్చిందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com