ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబుకు అధికారం ఇచ్చి మన పీకలు మనమే కోసుకుంటామా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2023, 04:01 PM

చంద్రబాబు పరిపాలన ఎంత లోఫభూయిష్టంగా ఉన్నదో, జగన్ ను సీఎం  చేస్తే ఎలాంటి పాలన చేస్తామో గతంలోనే చెప్పామని, ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత వైయస్సార్ సీపీ అప్పుడు ఏం చెప్పింది.. ఇప్పుడు ఏం చేసిందో వివరించేందుకు బస్సు యాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నన్నామని రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరవు అన్నారు.  రూ. 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఎచ్చెర్ల నియోజకవర్గానికి సీఎం జగన్ మంజూరు చేసారని, దీంతో ఇకపై గుజరాత్ వంటి రాష్ట్రాలకు మత్స్యాకారులు ఉపాధి కోసం వలస వెళ్లిన పరిస్థితి ఉండదని, హార్బర్ కోసం ఎవరూ అడగకపోయినా  జగన్  దూరదృష్టితో మంజూరు చేసారన్నారు. రాజ్యాంగ బద్దమైన పాలన ను జగన్ చేస్తున్నారని, ప్రభుత్వంలోనూ,  పాలనలోనూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు పని చేస్తున్నారని, అందుకే హార్బర్ , ఫిషి ల్యాండింగ్ సెంటర్ ను  ఈ ప్రాంతానికి మంజూరు చేసారాన్నారు. సీఎం జగన్ తన పాలనలో కులాలు, మతాలు, వర్గాలను చూడటం లేదని, కానీ చంద్రబాబు మాత్రం వర్గాలు చూస్తూ జాతుల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.. పేదలకు సాయం చేస్తుంటే చంద్రబాబు అన్యాయమని చెబుతూ,  తనకు మరోసారి అధికారం కావాలని అడుగుతున్నాడని, మీ పీక కోసే వాడికి అవకాశం ఇచ్చి మన పీక మనమే కోసుకుంటామా అని ధర్మా ప్రసాదరావు ప్రజలను ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తూ ఇచ్చిన మాటలకు కట్టుబడి చెప్పిన అన్ని హామీలను నెరవేర్చిన ప్రభుత్వాన్ని కొనసాగించుకుంటామా, లేక  మాయ మాటలతో  మోసం చేసే చంద్రబాబును తెచ్చుకుంటామా అన్నది ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజదానిని కాకుండా అడ్డుకుంటూ అన్యాయం చేస్తున్న చంద్రబాబును ఈ ఎన్నికల్లో మట్టి కరిపించాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com