అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసారు. వివరాల్లోకి వెళ్ళితే... పాల్నగర్ జంక్షన్లో తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన వ్యక్తి నుంచి ఎనిమిది మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో హెచ్సీ ధన్రాజ్, పీసీ గంగాధరుడు పాల్గొన్నట్టు తెలిపారు. ముడిదాం గ్రామంలో అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి ఐదు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రామచంద్రకుమార్ తెలిపారు.