ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుదర్శన హోమం నిర్వహించిన బత్తుల బలరామకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:50 PM

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా సోమవారం కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సుదర్శన హోమం నిర్వహించారు.తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించడంతో అపవిత్రమైందన్నారు. ఆ పాపం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని సుదర్శన హోమం నిర్వహిస్తున్నామన్నారు. జనసేన పార్టీ కార్యాలయం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు నరసింహస్వామి ఆలయానికి శోభయాత్రగా వెళ్లారు. 108 కలశాలతో కొండ దిగువున స్వామి వారి పాదా లను అభిషేకించారు.


తదుపరి కొండమెట్లు (650)కు పసుపు రాసి బొట్లు పెట్టి కొండ ఎక్కా రు.అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. తదుపరి కొండ దిగువున స్వామి వారి ఆలయ కల్యాణ మండపం వద్ద మహా సుదర్శన యాగం నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త పరాసర రంగరాజభట్టర్‌, సర్పంచ్‌ కర్రి లక్ష్మీసరోజ, జనసేన జిల్లా కోఆర్డినేటర్‌ బత్తుల వెంకటలక్ష్మి,బత్తుల వందనాంబిక, తోట ప్రత్యూషదేవి, బత్తుల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com