ప్రకాశం జిల్లా, కంభం పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తున్నారు. మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసులు పట్టణంలో స్పీడ్ బ్రేకర్లను గురువారం ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలో వేగంగా వెళుతున్న వాహనాలు స్పీడ్ బ్రేకర్ల వద్ద వేగం తగ్గించి వాహనాలు నడపవలసిన పరిస్థితి తలెత్తింది దీంతో రోడ్డు ప్రమాదాలకు కొంతవరకు చెక్ పడినట్లుగా ప్రజలు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.