విశాఖలో బీచ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కలకంరేపింది. దారుణమైన స్థితిలో డెడ్బాడీ ఒడ్డున ఉంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతురాలిని పెద గంట్యాడలో ఉండే శ్వేతగా గుర్తించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
శ్వేతకు వివాహంకాగా.. భర్త హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు చెబుతున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె భర్తతో చివరిగా కాల్ మాట్లాడినట్లు చెబుతున్నారు. పోలీసులు పెద గంట్యాడలో ఉండే శ్వేత అత్తింటివారిని ప్రశ్నిస్తున్నారు.
అయితే యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో శ్వేత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూ పోర్టు పోలీస్ స్టేషన్లో ఆమె కనిపించడం లేదంటూ అత్తింటివారు ఫిర్యాదు చేయగా.. కేసు కూడా నమోదైంది. ఇంతలోనే బీచ్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. యువతి చనిపోయిన తర్వాత అర్ధరాత్రి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు శ్వేత తన భర్తను ఉద్దేశించి రాసిన లేఖ బయటకు వచ్చింది. నువ్వెప్పుడూ నేను లేకపోయిన బిందాస్గా ఉండగలవు. నీకు ఏమాత్రం ఫరక్ పడదని నాకు ఎప్పుడో తెలుసు. ఏమైతేనేం నీ భవిష్యత్తుకు, నీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్. చాలా మాట్లాడటానికి ఉన్నా కూడా నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు బయటకు ఒప్పుకున్నా.. ఒప్పుకోకున్నా నీకు అంతా తెలుసు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని లేఖ రాసి మరీ శ్వేత ఆత్మహత్యకు పాల్పడింది.
తాను ఉద్యోగం కోసం రెండు నెలల క్రితమే హైదరాబాద్కు వచ్చి హాస్టల్లో ఉంటున్నానని.. మరో రెండు నెలలు ఆగితే ఇక్కడికి షిఫ్ట్ అవుదామని చెప్పానని.. శ్వేత తనతో మాట్లాడొద్దని చెప్పిందని.. తాను చాలాసార్లు తనకు ఫోన్ చేశానని.. మెసేజ్లు కూడా పెట్టానని ఆమె భర్త తెలిపాడు. శ్వేత ఐదు నెలల గర్భిణి అని.. తొందరపాటులో రెండు జీవితాలు ముగిసిపోయాయని అతడు వాపోయాడు.
ఇదిలావుంటే శ్వేత తల్లి మాత్రం ఆమె అత్తింటి వారే ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తోంది. తమ అమ్మాయి సివిల్స్ కోచింగ్ తాము ఇప్పిస్తామని చెప్పారని.. ముందుగా ఒప్పుకోకున్నా సరే వాళ్లే ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారని.. కానీ ఏడాది తిరిగే సరికే తన బిడ్డ ఇలా విగత జీవిగా మారిందని ఆమె వాపోయింది.