ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైలవరం నుంచి పోటీకి చంద్రబాబు యోచన: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 09:48 PM

కుప్పం నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు భయపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. కుప్పం వదిలేసి, కల్యాణదుర్గం, కృష్ణా జిల్లా మైలవరం నుంచి పోటీ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వైస్సార్సీపీ కార్యకర్తలం అందరం కలిసి పనిచేస్తే.. 175 స్థానాలకు 175 గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతీ గడపకూ వెళ్లి వివరించాలని వైసీపీ నాయకులకు సూచించారు.


గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలనకు ప్రజల దగ్గరకు తీసుకెళ్లామని.. మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ తరఫున ప్రతీ సచివాలయ పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించబోతున్నామని చెప్పారు. కుప్పంలో చంద్రబాబుకు ఎదురైన పరిస్థితులే.. కల్యాణదుర్గంలోనూ రిపీట్ అవ్వాలని.. ఎక్కడికక్కడ చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పెట్టిన టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు నాయకులు, కార్యకర్తలందరం సమష్టిగా పనిచేద్దామని చెప్పారు. కచ్చితంగా 175 స్థానాల్లో విజయం సాధించాలని స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com