ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రత్యర్థి పార్టీ నేతను పరామర్శించి...ఆశ్చర్యపర్చిన నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:42 PM

టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారం లో బాదుడే బాదుడు కార్యక్రమం లో పాల్గొన్నాను. స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నాను. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను. లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాను.


ఈ క్రమంలో నారా లోకేష్ వైఎస్సార్‌సీపీ నేత ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోలను నారా లోకేష్ ట్వీట్ చేశారు. నారా లోకేష్ వెంట టీటీపీ నేతలు కూడా ఉన్నారు.


వైసీపీ పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తున్నారని లోకేష్ విమర్శించారు. సంక్షేమం గోరంత.. బాదుడే బాదుడు పేరుతో జగన్ దోపిడీ కొండంత అన్నారు. అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని జగన్ దోచుకుంటున్నారని.. పన్నుల భారం తగ్గి సామాన్యులు బ్రతకాలంటే జగన్ ప్రభుత్వం పోయి చంద్రన్న ప్రభుత్వం రావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com