ఎంఐఎం పార్టీని కార్పొరేషన్ ఎన్నికల్లో తరిమికొడతాం బండి సంజయ్ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంస్థాగతం సభ్యత నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమము సామ రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి , నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బిజెపికి అత్యంత సభ్యులు ఉన్నారని తాజాగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కష్టపడి మరింత మందిని సభ్యులుగా చేర్చాలని కోరారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ ఒకటేనని విమర్శించారు .కాంగ్రెస్ పార్టీని 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని కానీ ఒక్క గ్యారంటీకి కూడా వారంటీ లేదన్నారు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా, మహిళలకు4వేలు,తులంబంగారం , నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 6 గ్యారెంటీల నుండి ప్రజల దృష్టిని మార్చేందుకు హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతున్నారని విమర్శించారు. చిన్నా చితక వారి మీద హైడ్రా పతాపం చూపుతుందని ముందు అలాంటి వాటికి అనుమతులు ఇచ్చిన వారి మీద కేసులు పెట్టాలని పేదల మీద ప్రతాపం చూపెడుతున్న హైడ్రాకు వ్యతిరేకమని అన్నారు.హైడ్రా కాదు ముందు 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.
కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపికి తప్ప ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవని నేషన్ ఫస్ట్, మనం సెకండ్ అనేది బిజెపి నినాదమని బిజెపి గెలవడం మనకంటే దేశానికి ఎక్కువ ముఖ్యమన్నారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో బిజెపి పార్టీకి ఎదురులేదని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదును శేరిలింగంపల్లి నియోజక వర్గం నిలిచేటట్టుగా కష్టపడి పని చేస్తామని పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రవీందర్రావు,నరేష్ ,రాఘవేంద్రరావు , మణిభూషణ్ , మహిపాల్ రెడ్డి , అశోక్ కురుమ , నరేందర్ రెడ్డి , నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు , కంటెస్టెంట్ కార్పోరేటర్స్ , మహిళా మోర్చా నాయకురాల్లు పాల్గొన్నారు.