నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మార్కండేయ స్వామి టెంపుల్ వెనక భాగంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకొని జమ్మి చెట్టు ప్రతిష్టాపన మరియు పార్కు ఏర్పాటు చేయుట కొరకై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ స్థల పరిశీలన చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు,పట్టణ అధ్యక్షులు రఘురాం,కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, పాసింజర్ శ్రీనివాసులు, వెంకటేష్,సుంకరి బాలరాజ్,కో ఆప్షన్ సభ్యు లు మహబూబ్ అలీ ఖాదర్,మాజీ ఎంపీపీ రామనాథం,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శత్రు నాయక్,యూత్ కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్, కుంద మల్లికార్జున్ ఎమ్మార్పీఎస్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లేష్,మైనార్టీ మండల అధ్యక్షులు రఫీ,సాదిక్,ఖదీర్ మీడియా ఇంచార్జ్ అంజి తదితరులు పాల్గొన్నారు.