గణేష్ నవరాత్రుల ఉత్సవాల అనంతరం జరుపుకునే నిమజ్జన వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు.బుధవారం ముత్తారం మండల కేంద్రంతో పాటు కేశనపల్లి గ్రామాల్లోని పలు వినాయక మండపాలను ఎస్ఐ నరేష్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
అనంతరం వినాయక మండపాల నిర్వహకులతో మాట్లాడుతూ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జన వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని,గొడవలు రాగద్వేషాలు లేకుండా మతసామరస్యంగా పండగలను జరుపుకోవాలని సూచించారు.నిమజ్జన వేడుకలు అయ్యేంతవరకు ప్రతి క్షణం పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటుందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు.