ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి పనులకు భూ కేటాయింపులు పకడ్బందీగా నిర్వహించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2024, 03:00 PM

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూ కేటాయింపులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మంథని పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి విస్తృతంగా పరిశీలించారు.కాటారం క్రాస్ రోడ్ వద్ద గల పాత డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ భూమి లెవెలింగ్ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.అంబేద్కర్ కాలనీలోని బర్రెకుంట చెరువు పరిశీలించిన కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మంథనిలోని మల్లేపల్లి డిగ్రీ కళాశాల సమీపంలో గల 5ఎకరాల ప్రభుత్వ స్థలం,చైతన్యపురి కాలనీలోని బాయ్స్ హై స్కూల్,గర్ల్స్ హై స్కూల్,వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మంథని పట్టణంలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం,నూతన పురపాలక భవనం నిర్మాణం,సబ్ స్టేషన్ నిర్మాణం,నూతన రెవెన్యూ డివిజన్ అధికారి తహసిల్దార్ అధికారి కార్యాలయాల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టుటకు వీలుగా అనువైన ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.మంథని పట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల స్కెచ్ లను పూర్తి చేసి,ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఎక్కడ వీలుగా ఉంటుందో వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అంతకుముందు రామగిరి మండలంలోని రాజాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం పేట గ్రామానికి సంబంధించి 708 ఎకరాల సింగరేణి భూసేకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్,అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com