బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో సోమవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే గురువుల పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.