నారాయణపేట జిల్లా కేంద్రం శివారులోని కొండారెడ్డిపల్లి చెరువు ఆదివారం ఉదయం అలుగు పారింది. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులోకి పెద్ద మొత్తంలో వర్షపు నీరు రావడంతో పూర్తిస్థాయిలో నిండి మత్తడి పోస్తోంది.
జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు సూచించారు. మత్తడి పోస్తున్న చెరువును చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు.