వరుసగా పడుతున్న భారీ వర్షాలకు ఆదివారం మక్తల్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కాలనీలో పర్యటించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి వెంటనే నీరు దిగువకు పోయేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలని ప్రజలు వున్నారు.