ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 11:47 AM

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల  సమావేశం మండల అద్యక్షులు గంగుల కొమురెళ్ళ్లి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో గంగుల కొమురేళ్లి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో,బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్య్రమాన్ని ప్రారంభించాలని,అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా పని చేయాలని కార్యకర్తలను కోరడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ మహిళా మొర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మరియు మండల సభ్యత్వ ఇంచార్జి చింతకింది అనసూర్య మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయిలో 200కి మించి సభ్యులను చేర్చి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పని చేయాలని,సర్పంచులుగా,వార్డ్ మెంబర్ లుగా,ఎం.పి.టి.సి,జెడ్.పిటి.సి స్థానాలను కైవసం చేసుకునే దిశగా పని చేయాలని కార్యకర్తలను కోరారు.ఈ కార్య్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తూరు బాబూ,ప్రధాన కార్యదర్శి పల్లే మోహన్ రెడ్డి,ఉపాధ్యక్షులు తొడేటి గట్టయ్య,సాయిల్ల తిరుపతి,ఎస్.సి మోర్చా ప్రధాన కార్యదర్శి తడగొండా అంజన్న,బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కాశెట్టి రాజు,నాయకులు తిరుమల రెడ్డి,రాజేశం,భీరాన్న,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com