ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి రియలెస్టేట్ రంగాన్ని బ్రతికించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జాక్ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల కుటుంబాలు రియలెస్టేట్ రంగాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి గతంలోనే తీసుకుని వెళ్లి పరిష్కారించాలని కోరినట్లు తెలిపారు. దానికి సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.