తమ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించటంలేదని బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మాసిటీ కోసం ముచ్చర్ల సహా పలు గ్రామాల్లో దాదాపు 12 వేల ఎకరాలు సేకరించామని చెప్పారు.ఫార్మాసిటీని రద్దు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిందని, రద్దు చేస్తే రైతులకు వారి భూములను ఎప్పుడు తిరిగిస్తరో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోదండరెడ్డి ఫార్మాసిటీ భూములను రైతులకు తిరిగిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు