ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్న జిష్ణుదేవ్‌ వర్మ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2024, 08:17 AM

తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.జిష్ణుదేవ్‌ త్రిపురలోని తన నివాసమైన కుంజబన్‌ ప్యాలెస్‌ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకొని సాయంత్రం 5.03 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే జిష్ణుదేవ్‌ని గవర్నర్‌గా ప్రమాణం చేయించనున్నారు.ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. జిష్ణుదేవ్‌ 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. త్రిపుర నుంచి ఓ రాష్ర్టానికి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తిని తానేనని జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం అగర్తలాలో మీడియాకు వెల్లడించారు


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com