ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీకి పిలిస్తే.. అఘాయిత్యం,,,,, వనస్థలిపురంలో దారుణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 08:03 PM

చిన్ననాటి స్నేహితుడిని పిలిచి పార్టీ ఇస్తే.. మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు స్నేహితుడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ హోటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం ఏసీపీ పి. కాసిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన ఓ యువతికి ఇటీవలే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడు గౌతంరెడ్డికి తెలిపి సంతోషాన్ని పంచుకుంది. అతడు పార్టీ ఇవ్వాలని కోరడంతో సోమవారం (జూలై 29) రాత్రి 7.30 గంటల సమయంలో ఇద్దరూ కలిసి వనస్థలిపురం పరిధిలోని ఓంకార్ నగర్‌లో హైదరాబాద్-విజయవాడ హైవే సమీపంలోని బొమ్మరిల్లు హోటల్‌కు వచ్చారు.


రెస్టారెంట్‌లో ఇద్దరూ కలిసి పార్టీ చేసుకొని, మద్యం తాగారు. ఆ తర్వాత కింది అంతస్తులో ఉన్న హోటల్ గదిలోకి వెళ్లారు. కాసేపటి తర్వాత యువతి మత్తు నుంచి తేరుకొని చూడగా.. తన గదిలో గౌతంరెడ్డితో పాటు, మరో యువకుడు కూడా ఉన్నారు. అంతేకాకుండా వారు అర్ధనగ్నంగా ఉన్నారు. వారిని అలా చూసి కేకలు వేయడంతో గదిలో నుంచి పారిపోయారు. స్నేహితులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకున్న బాధితురాలు ఓ స్నేహితురాలికి ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ తర్వాత ఆమె సాయంతో వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డితో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారి కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ కాసిరెడ్డి తెలిపారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పట్టుకొని విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి తెలిపారు.


ప్రధాన నిందితుడు అరెస్ట్


ప్రధాన నిందితుడు గౌతమ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలిని దళిత యువతిగా గుర్తించారు. నిందితులపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సంఘటన జరిగినో హోటల్‌ను పరిశీలించిన పోలీసులు.. సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించి రెండో నిందితుడిని గుర్తించారు. రెండో యువకుడు కూడా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. గౌతమ్ రెడ్డి, తాను రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఒకే స్కూల్‌లో చదువుకున్నామని, తరచూ కలిసేవాళ్లమని, ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లమని పోలీసులతో బాధితురాలు చెప్పింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com