లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ లాలాపేట్ వినోబానగర్ లోని శ్రీ భగవతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన పలారం బండి కార్యక్రమంలో కామారెడ్డి 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్ రావు ముఖ్య అతిధిగా పాల్గొని పలారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం అతిధులను అసోసియేషన్ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఫలహారం బండి ఊరేగింపు, పోతురాజుల వీరంగం, డప్పు చప్పుళ్ళు, కళాకారుల ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది.