భూతగాదాలతో అన్నదమ్ములు సోదరుడిని హత్య చేశారు. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడకు చెందిన మహేశ్వర్ రెడ్డి, శేషిరెడ్డి, చిన్ననాగిరెడ్డి అన్నదమ్ములు. వీరి మధ్య ఏడాది నుంచి ఆస్తితగాదాలుండగా నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి కలిసి శేషిరెడ్డిని చంపారు. బైక్ పై మధ్యలో మృతదేహాన్ని కూర్చోబెట్టుకుని కర్నూల్ జిల్లా కొత్తకోట శివారులో పడేసేందుకు తీసుకెళ్లారు. ముసుగు కప్పి మృతదేహాన్ని తీసుకెళ్లడంతో అనుమానం వచ్చిన కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. దీంతో భయపడి శవాన్ని అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయారు.