ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని బీజేపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నందు నమాజీ, కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని బురుడువాడి వీధి కి చెందిన మాణిక్యమ్మ కు మంజూరైన రూ. 24 వేల విలువ గల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం అందించారు. సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసేందుకు కృషి చేసిన కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.