రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వానలు కురవనున్నట్టు హైదారాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.రాజన్న-సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు అధికారులు రెడ్అలర్ట్ జారీ చేశారు