నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని దండు క్రాసింగ్ దగ్గర 167 వ జాతీయ రహదారిపై ఆదివారం బైకు లారీ ఢీకొని రమేష్ అనే వ్యక్తి మృతి చెందిన చోటుచేసుకుంది. మృతుడు మక్తల్ నుండి హైదరాబాద్ వైపు బైక్ పై వెళ్తుండగా హైదరాబాద్ వైపు నుండి రాయచూరు వైపు వెళ్తున్న విఆర్ఎల్ ట్రావెల్స్ లారీ ఎదురెదురుగా ఢీకొని రమేష్ కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశారు.