నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి బాలస్వామిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆయనను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో బాలస్వామి మాట్లాడుతూ, అకారణంగా పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని అన్నారు. పోలీసులు ఇలా వ్యవహరించటం సరికాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.