నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య ఆదివారంలో ఓప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మక్తల్ ఉగ్ర మూకలకు స్లీపర్ సెల్ పనిచేస్తుందని పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరెస్టు చేయాలన్నారు. శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా దాడులకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు.