ఈనెల 29 నుంచి 31 వరకు పలు ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ పరిధిలో పూణె డివిజన్లో నిర్వహణ పనుల కారణంగా రానున్న మూడ్రోజులు మెుత్తం 62 ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దౌండ్లో ఇంటర్ లాకింగ్ పనిని నిర్వహించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రద్దయిన ట్రైన్ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
జులై 29న పూణె- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12025), పూణే- సోల్పూర్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12169), పూణే- బారామతి DMU (ట్రైన్ నెంబర్ 01511) , పూణే- హరంగుల్ TOD ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 01487), అమరావతి- పూణే ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 11406) ట్రైన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. జులై 30న పన్వెల్- నాందేడ్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 17613) , హడప్సర్- సోలాపూర్ DMU ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 11421), దౌండ్-నిజాంబాద్ DMU ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 11409), డౌండ్- హడప్సర్ DMU (ట్రైన్ నెంబర్ 01522), సికింద్రాబాద్-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12220) రద్దు చేసినట్లు చెప్పారు.
ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు. జులై 29న మొత్తం 15 ట్రైన్లు, జులై 30న 23 ట్రైన్లు, జులై 31న 24 ట్రైన్లు రద్దు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పనుల తర్వాత ట్రైన్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించారు. కాగా, తెలంగాణ ఏపీ మధ్య కూడా కొన్ని ట్రైన్లు రద్దయ్యాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్లో మూడో ట్రైన్ లైను పనుల నేపథ్యంలో ప్రయాణికులకు ట్రైన్ సేవల్లోనూ అంతరాయం కలగనుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇది వరకే వెల్లడించారు. జులై 28 నుంచి ఆగస్టు 10 వరకు ట్రైన్లు రద్దు చేసినట్లు చెప్పారు.