వైద్య రంగంలో ఆశ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్ అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో అశాలకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆశ కార్యకర్తలకు కనీస వేతనం నెలకు రూ. 18 వేలు ఇవ్వాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.