నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి బుధవారం తండ్రి జానారెడ్డి, తమ్ముడు జయవీర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని శ్రీరామా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నామినేషన్ వేసేందుకు నల్గొండకు బయలుదేరారు. కాగా ఇక్కడ పూజలు నిర్వహించి నామినేషన్ వేయడం దశాబ్దాలుగా కొనసాగుతున్న జానారెడ్డి కుటుంబ సెంటిమెంట్ కావడం గమనార్హం.