నల్గొండ జిల్లా పానగల్లో విషాదం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్కు వెళ్లిన దంపతులు మృత్యువాతపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని దంపతులు స్పాట్లోనే మృతి చెందారు. పానగల్లు ఉదయ సముద్రం ప్రాజెక్టు దిగువన దంపతులు ఓర్సు విష్ణు, స్వప్న ఈ ఉదయం రోజుమాదిరే మార్నింగ్ వాకింగ్కు వెళ్లారు. అయితే తెల్లవారుజామును ఓ గుర్తు తెలియని వెహికల్ వెనుక నుంచి బలంగా దంపతులను ఢీకొట్టింది.
తీవ్ర గాయాలపాలైన దంపతులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లులు ఉండగా.. విష్ణు ఎన్జీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్గా పని చేస్తున్నాడు. ఒకే ప్రమాదంలో దంపతులు మృతి చెదంటంతో వారి పిల్లలు అనాథలయ్యారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
రెండు నెలల క్రితం హైదరాబాద్లోని బండ్లగూడలోనూ ఓ కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి కారు దూసుకెళ్లింది. బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మద్యం మత్తు, మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.