సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం రాక్షస పాలనా కొనసాగిస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడుతూ..... అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో పాలకులు కోట్లు దండుకుంటున్నారని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. రాష్ట్రం అవినీతిలో ముందంజలో, అభివృద్ధిలో వెనుకంజలో ఉందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో మైనింగ్ మాఫియా పెద్దఎత్తున నడుస్తోందని, గ్రానైట్, ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని తెలిపారు.