హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ నేడు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం ఐనది. తొలి పూజలో గవర్నర్ తమిళసై దంపతులు, మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ ఏడాది 63 అడుగుల కలిగి శ్రీ దశవిద్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. కుడివైపు పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి.. ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.