బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. అలానే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, బీఆర్ఎ్స మధ్య కుదిరిన సమైక్యత వల్లే ‘సెప్టెంబర్ 17’ దినోత్సవాన్ని సమైక్యత దినంగా జరుపుతున్నారని అన్నారు. సాయుధ పోరాటంంతో సంబంధం లేని వారు తెలంగాణ సాయుధ పోరాటంపై తమకు హక్కు ఉందని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.