ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలోని నాందేడ్ లో భూకంపం..

national |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 02:01 PM

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం మోస్తారు భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఒక ప్రకటన చేసింది. నాందేడ్ నార్త్ సిటీ, హద్గావ్, అర్ధపూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది.నాందేడ్ జిల్లాలో మంగళవారం ఉదయం 6.52 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్‌గావ్ తాలూకాలోని సావర్‌గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం ఉదయం 6.52 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 19.38 ఉత్తర అక్షాంశం, 77.46 తూర్పు రేఖాంశంలో ఉంది. భూమి ఉపరితలంలో 5 కి.మీ లోతులో ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి కిషోర్ కుర్హే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com