వేల్పూర్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సిఐటియూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె శనివారం ఆరవ రోజుకు చేరుకుంది. అనంతరం మండల అధ్యక్షురాలు స్వరూప మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, గ్రాటివీటి అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేని యెడల సమ్మెను ఉధృతం చేస్తామన్నారు.