తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు పొదిలి వెంకటేశ్వర్లు, ఎం డీ. ముజాఫర్ తెలిపారు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడారు. ఉద్యమకారులకు గుర్తింపుకార్డులు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూం, పెన్షన్, బస్సు, రైలు రాయితీ పాస్ లతో 1969 ఉద్యమకారులుగా గుర్తించాలని, రెండు ఎమ్మెల్సీ, ఒక ఎంపీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు