ఖమ్మం నగరంలోని టౌన్-5 రామాలయం సబ్ స్టేషన్ పరిధిలోని 11 కేవీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఫీడర్ నుంచి ఉన్న విద్యుత్ లైన్ల క్లియరెన్స్ పనుల నిమిత్తం ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కమాన్ బజార్, వల్లాలవారి వీధి, షాదీఖానా, స్టేషన్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.