ఏన్కూరు మండలంలో మిరప తోటలకు జెమినీ వైరస్ సోకింది. ప్రారంభ దశలోనే వైరస్ సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదివారం మిరప తోట లను శాస్త్రవేత్తలు చైతన్య, సునిత, జెన్సీల బృందం పర్యటించి సూచనలు ఇచ్చారు. వైరస్ నివారణకు ముందుగా తోటలో కలుపు లేకుండా చూసుకోవాలన్నారు. తెల్లదోమ నివారణకు పసుపురంగు జిగురు అట్టకు 15 నుంచి 20 వరకు ఎకరానికి పెట్టాలి. వేపనూనె 1500 పీపీఎం 5ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని సూచించారు.