తెలంగాణ ప్రజలను మోసం చేసేలా సెప్టెంబర్ 17ను సమైక్యత, విమోచనం, విలీనం పేరుతో నిర్వహిస్తున్న పార్టీలు చరిత్రను వక్రీకరించే కుట్రలు చేస్తున్నాయని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విమర్శించారు. అయితే, ఎవరెన్ని కుట్రలు చేసినా కచ్చితంగా విద్రోహ దినమేనని తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో 'తెలంగాణలో సెప్టెంబర్ 17న ఏం జరిగింది? 'అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.