ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎస్ఆర్ నగర్ పీస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రామప్రసాదరావు తెలిపిన వివరాలు వరంగల్ కు చెందిన అవినాష్ రెడ్డి (26) ఓ హోటల్లో బస చేశాడు. శనివారం గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.