రాష్ట్రంలోని వివిధ యునివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఓయూ కన్వీనర్ ప్రొ. పాండురంగా రెడ్డి ఆదివారం తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లు, 26న ఎడిటింగ్, 29న సీటు సాధించిన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆయా కాలేజీల్లో వచ్చే నెల 4 వరకు జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలన్నారు.