ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని గునుగల్ గ్రామంలో సోమవారం పెద్దమ్మ, గంగమ్మతల్లి దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు బోనాలతో అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలొ బీఆర్ఎస్ నేతలు మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, బీఆ ర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు జంగమ్మ, సర్పంచ్ ఇందిర, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు