ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 10:56 PM

తెలంగాణలోో ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అనధికారిక వర్గాల సమాచారం మేరకు వచ్చే వారంలో పదో తరగతి, ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది. ఫలితాల ప్రాసెసింగ్ తుది దశలో ఉందని అధికార వర్గాల సమాచారం. 


ఈ నెల 10న ఇంటర్మీడియెట్ ఫలితాలు, 12న పదో తరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 5,05,625 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలను 7,39,493 మంది విద్యార్థులు రాశారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com