ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సకల సౌకర్యాలతో పంచభూత వైకుంఠదామం,,,వరంగల్‌లో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 06:15 PM

రాష్ట్రంలోని స్మశాన వాటికల రూపు రేఖలను మార్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వరంగల్ పట్టణంలో పంచభూత వైకుంఠధామాన్ని నిర్మించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ. 4.50 కోట్ల వ్యయంతో స్మశాన వాటికను అద్భుతంగా తీర్చిదిద్దారు. సకల హంగులతో ఈ స్మశాన వాటిక రూపుదిద్దుకుంది. పేరుకు తగ్గట్లే గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని ఇలా పంచభూతాల సమ్మేళంగా స్మశాన వాటికను అభివృద్ధి చేశారు.


గతంలో అక్కడ ఉన్న స్మశాన వాటిక స్థానంలో నూతనంగా ఈ స్మశాన వాటికను నిర్మించారు. పార్కులను తలపించేలా పచ్చని పచ్చిక బయలు, విశాలమైన స్థలంలో స్మశాన వాటిక రూపుదిద్దుకుంది. వెయిటింగ్ హాల్స్, లైబ్రరీ, లాకర్ రూమ్‌లు, లైటింగ్, సీసీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్‌తో స్మశాన వాటికను అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక దహన వాటికలు, దహనం చేసేందుకు వాడే కర్రలు స్టోర్ చేయటానికి స్పెషల్ రూమ్స్, స్నానపు గదులు, వాష్‌రూమ్స్, బట్టలు మార్చుకునే గదులు ఇలా ప్రతి ఒక్కటి నిర్మించారు. పార్కింగ్ స్థలంలో పాటు ఓపెన్ ప్లేస్‌లో చెట్లను నాటారు.


ఈ స్మశాన వాటికను ఐటీ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తదితరులు శనివారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం వైకుంఠదామాన్ని మంత్రులు పరిశీలించారు. అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా జరగాలని అందుకే వైకుంఠదామాలు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com