ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ హామీ అమలైంది ఎక్కడ... కొనుగోలు చేయకుండా చేతులు ఎత్తేస్తున్నారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 06:15 PM

అకాల వర్షాలతో పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన ప్రభుత్వ పెద్దలు.. తడిసిన ధాన్యం కొంటామని రైతన్నలకు భరోసా ఇచ్చారు. తడిసిన ప్రతి గింజా కొంటామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు అన్నదాతలకు హామీలు ఇచ్చారు . కానీ.. తీరా చూస్తే పరిస్థితి తారుమారు అవుతోంది. అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో అనేక చోట్ల ధాన్యం తడిసి రంగు మారింది. అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి రైస్ మిల్లులకు కేటాయిస్తున్నారు. కానీ.. తడిసిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు రైస్ మిల్లర్లు. ఇలాంటి ధాన్యం కొనుగోలు చేయలేమంటూ.. ఆదివారం నుంచి రైస్ మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్ నిలిపేస్తున్నట్లు నిజామాబాద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు పంపవద్దని జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేసింది.


నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైస్ మిల్లులకు అలాట్ చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్ చేయడం వల్ల తిరిగి సీఎంఆర్ బియ్యం ఇవ్వలేక నష్టపోతామని చెబుతున్నారు. రైస్ మిల్లర్ల తీరుతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com