FIR చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ నుండి రీసెంట్గా వచ్చిన మూవీ "మట్టి కుస్తీ". తమిళంలో "గట్టకుస్తి". ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహించగా, విష్ణు విశాల్ స్టూడియోస్, ఆర్ టీ టీం వర్క్స్ బ్యానర్ పై రవితేజ, విష్ణు విశాల్ నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి డీసెంట్ రివ్యూస్ వచ్చాయి.
ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. మార్చి 19న అంటే ఆదివారం సాయంత్రం ఆరింటికి స్టార్ మా ఛానెల్ లో మట్టి కుస్తీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది.