కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ గా తనకు ఒక సినిమా చాలా బాగా నచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "Mrs. ఛటర్జీVs నార్వే". ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో విడుదలయ్యింది. ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్స్ ని భార్య జ్యోతికతో చూసిన హీరో సూర్య తన రివ్యూను ట్వీట్ రూపంలో తెలియచేసారు. వాస్తవ సంఘటన గురించి చెప్పిన ఒక ముఖ్యమైన చిత్రమిది. సినిమా చూసిన తరవాత మా గుండెలు బరువెక్కాయి. ఇంకా మేము ఆ ఆలోచనలోనే ఉన్నాం. రాణి ముఖర్జీ, డైరెక్టర్ అషిమా చిబ్బర్ మరియు చిత్రబృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు...అంటూ సూర్య ట్వీట్ లో పేర్కొన్నారు.