టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో స్టార్ హీరోల గతచిత్రాల నిర్మాతలు హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా విడుదల చేసేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన డిజాస్టర్ మూవీ "ఆంధ్రావాలా" ఈనెల 24న విడుదల కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలయ్యింది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, తారక్ ల కలయికలో మొదటిసారిగా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ 2004లో విడుదలై, అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో రక్షిత హీరోయిన్ గా నటించింది. స్వర్గీయ శ్రీ చక్రి గారు సంగీతం అందించారు.